Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమానేరు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి

మానేరు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి

- Advertisement -
  • – సీఎం రేవంత్‌రెడ్డికి చాడ వెంకట్‌రెడ్డి వినతి
    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

    కరీంనగర్‌లోని మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సంబంధిత గుత్తేదారు, గత పాలకుల పాత్రపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అందులో పర్యాటక శా రూ.వంద కోట్లు, నీటిపారుదల శాఖ రూ.వంద కోట్లు నిధులను విడుదల చేశాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఈ రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులు జరిగాయని పేర్కొన్నారు. ఆ పనులను గత పాలకుల అనుచరులకు అప్పగించారని విమర్శించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా గుత్తేదారు నిర్లక్ష్యం వహించారని తెలిపారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారని పేర్కొన్నారు. ఆ నిర్మాణంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నదని వివరించారు. రివర్‌ ఫ్రంట్‌ పరిధిలో చెక్‌డ్యాములను నిర్మిస్తే వర్షాకాలంలో కురిసిన వర్షాలకు అవి పూర్తిగా కొట్టుకుపోయాయని తెలిపారు. ఆ తర్వాత కూడా నిర్మాణ పనులకు నిధులను విడుదల చేసిందని పేర్కొన్నారు. ఐదేండ్లు గడుస్తున్నా ఆ పనులు ఇంకా పూర్తి కాలేదని తెలిపారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -