Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంమహిళలకు పెన్షన్‌ పెంపు

మహిళలకు పెన్షన్‌ పెంపు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లో మహిళలకు సామాజిక పెన్షన్‌ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్‌ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400 గా ఉన్న పెన్షన్‌ను ఇప్పుడు రూ.1100 లకు పెంచారు. పెరిగిన పెన్షన్‌ జూలై నెల నుంచే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించారు. సామాజిక భద్రతా పెన్షన్‌ పథకం కింద వృద్ధ మహిళలు, వికలాంగ మహిళలు, వితంతు మహిళలకు నెలనెలా ఇచ్చే పెన్షన్‌ను రూ.400 నుంచి రూ.1100 కు పెంచుతున్నామని తెలియజేస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. అర్హులందరూ జూలై నుంచే పెరిగిన పెన్షన్‌ అందుకుంటారని సీఎం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -