నవతెలంగాణ – హైదరాబాద్: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మారణహోమం పట్ల భారత్ మౌనంగా ఉండడాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తప్పుపట్టారు. భారత్ తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ద హిందూ ఆంగ్ల దినపత్రికలో సోనియా రాసిన వ్యాసాన్ని పబ్లిష్ చేశారు. ఇండియాన తన స్వరాన్ని వినిపించేందుకు ఇంకా ఆలస్యం కాలేదన్న టైటిల్తో ఆ ఐటమ్ను రాశారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ అంశంపై గతంలో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు విఫలమైనట్లు ఆమె పేర్కొన్నారు. భారత్ తన వైఖరిని స్పష్టం చేయడంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, భారత్ తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలుపాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు చేపట్టాలని ఆమె తన వ్యాసంలో సూచించారు.
గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు.. భారత్ మౌనం వీడాలి: సోనియా గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES