Sunday, June 22, 2025
E-PAPER
Homeజాతీయంయోగా డే స్పెష‌ల్ ఆఫ‌ర్..

యోగా డే స్పెష‌ల్ ఆఫ‌ర్..

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇంట‌ర్నేష‌న్ యోగా డే సంద‌ర్భంగా భారత పురావస్తు సర్వే సంస్థ(ASI) టూరిష్టుల‌కు బంపరాఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఆగ్రాలోని ప్ర‌ముఖ చారిత్ర‌క క‌ట్ట‌డం తాజ్ మ‌హాల్ ను ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించ‌కుండ‌నే సంద‌ర్శించొచ్చున‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఏప్రిల్ 18న జరుపుకునే ప్రపంచ వారసత్వ దినోత్సవం, షాజహాన్ వర్ధంతి ఉర్స్ సందర్భంగా తాజ్ మహల్ ప్రవేశ రుసుమును ASI సాధారణంగా రద్దు చేస్తుంది. కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్ సంద‌ర్శ‌న‌కు ఉచిత ప్ర‌వేశాన్ని క‌ల్పించారు. తాజ్ మహల్‌తో పాటు, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ, సికంద్రా, ఎట్మద్-ఉద్-దౌలా వంటి అనేక ఇతర చారిత్రక కట్టడాలకు కూడా ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

మ‌రోవైపు 11వ అంత‌ర్జాతీయ యోగా డే దినోత్స‌వ పుర‌స్క‌రించుకొని భార‌త్ తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా యోగాశాస‌నాలపై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ప్ర‌ధాని మోడీ ఆంధ్ర‌ప్రదేశ్ లోని విశాఖ వేదిక‌గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -