– ఆదివాసీలను అడవుల నుంచి దూరం చేసే కుట్ర
– తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) : రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ డా. మిడియం బాబురావు
నవతెలంగాణ-ముషీరాబాద్
ఆదివాసీలు సాగుచేస్తున్న భూముల నుంచి, వారు నివసిస్తున్న ప్రాంతాల నుంచి వారిని దూరం చేసి కార్పొరేట్ కంపెనీలకు అడవులను కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవో 49 టైగర్ కంజర్వేషన్ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, పోడు పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట టీఏజీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం జీవో 49 పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ అటవీ విధానంతో షెడ్యూల్ ప్రాంతాల్లోని వారి హక్కు లను కాలరాసి అడవిలోని ఖనిజ సంపద లను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజ ెప్పేందుకు తీసుకొచ్చిందన్నారు. అందులో భాగం గా చత్తీస్గఢ్ ప్రాంతంలోని హస్దే అటవీ ప్రాంతంలోని 4 లక్షల ఎకరాలను అదానీకి అప్ప జెప్పిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమూ బీజేపీ దారిలోనే ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టే ఈ విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించా రు. ఇందులో భాగంగానే టైగర్ కంజర్వేషన్ కోసం ఎలాంటి గ్రామసభలు జరపకుండా, షెడ్యూల్ ప్రాంత రాజ్యాంగ హక్కులను సైతం గౌరవించ కుండా 300కుపైగా గ్రామాలను ఖాళీ చేయించి, వారిని భూముల నుంచి వెళ్లగొట్టేందుకే జీవో 49 అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఆదివాసీ లను భూ నిర్వాసితులను చేసి వారికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా వారి కుటుం బాలను రోడ్డు మీదికి లాగారని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలని దరఖాస్తులు వస్తే కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిచ్చిం దనీ, ఇంకా 8 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తు న్న పోడుదారులకు హక్కు పత్రాలు ఇస్తామని ఇవ్వలే దన్నారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యాని ఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోలేదని, పైగా సాగు దారులపై ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయించడం దుర్మార్గమని తెలిపారు. తక్షణమే సాగులో ఉన్న పోడు సాగుదారులకు హక్కు పత్రా లిచ్చి వారిపై అక్రమంగా పెట్టిన కేసులను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభు త్వాస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి ఖాళీగా ఉన్న డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రవికుమార్, ఎర్మ పున్నం, కె.శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆత్రం తనుష్, ఆత్రం కిష్టన్న, తొడసం శంబు, ఉయిక విష్ణు, వృత్తిదారుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ పైళ్ల ఆశయ్య, నాయకులు అశోక్, రాజన్న, దర్శనాల మల్లేష్, సంకె రవి, కుశన్న రాజన్న, లంకా రాఘవులు, నైతం రాజు, కొట్నాక్ సక్కు తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం టైగర్ కారిడార్ రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES