నవతెలంగాణ హైదరాబాద్: ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి బుధవారం నాటికి 50 ఏండ్లు పూర్తవుతున్న నేపధ్యంలో మరోసారి గుర్తు చేసుకోవలసిన అవసరముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ ప్రకటిత ఎమర్జెన్సీ, ఇప్పుడు బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని వెస్లీ అన్నారు. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ పేరుతో ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి, ఈ నయా ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘నాడు ప్రకటిత ఎమర్జెన్సీ… నేడు అప్రకటిత ఎమర్జెన్సీ – మన కర్తవ్యం` అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో వక్తలుగా కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
Emergency:నాడు ప్రకటిత ఎమర్జెన్సీ – నేడు అప్రకటిత ఎమర్జెన్సీ – మన కర్తవ్యం సదస్సు (లైవ్)
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES