Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

మోడీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మోడీ ప్రభుత్వ తీరుపై శుక్రవారం కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. భారత్‌ తనకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలను అమెరికా నుండి తెలుసుకుంటున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. భారతదేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ కోసం వాణిజ్య ఒప్పందాన్ని సాధనంగా వినియోగించానని ట్రంప్‌ 16 సార్లు చెప్పారని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్‌ ప్రతినిధి జైరాం రమేష్‌ పేర్కొన్నారు. ఇప్పుడు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై రాబోయే కొద్ది రోజుల్లో సంతకం చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారని అన్నారు. దీనిని ఆయన చాలా పెద్ద విషయం అని పిలుస్తారని, ఆపరేషన్‌ సిందూర్‌ ముగియడానికి దారితీసినందున ఇది మంచిదేనని అన్నారు. అయితే భారతదేశం వాషింగ్టన్‌ డిసిలోని వైట్‌ హౌస్‌ నుండి చాలా ముఖ్యమైన నిర్ణయాలను తెలుసుకోవాలని ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

ముఖ్య రాయబారి రాజేష్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని భారత బృందం గురువారం అమెరికాతో తదుపరి రౌండ్‌ వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. రెండు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతున్నాయి. జులై 9లోపు ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ట్రంప్‌ ప్రకటన చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -