– ఊడిపోయిన కారు టైర్
నవతెలంగాణ – మెట్పల్లి
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు పెను ప్రమాదం తప్పింది. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి వచ్చిన మంత్రి.. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం మేరకు మెట్పల్లి వచ్చారు. తిరిగి ధర్మపురికి వెళ్తుండగా ఆరపేట్ శివారులో మంత్రి ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢకొీట్టింది. దీంతో మంత్రి వాహనం ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి ప్రమాదమూ కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో వాహనంలో మంత్రిని ధర్మపురి క్యాంప్ కార్యాలయానికి పంపించారు. కాగా ఇది అడ్లూరికి రెండో ప్రమాదం. ప్రభుత్వ విప్ హోదాలో ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES