- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -