– జమ్మూకాశ్మీర్లో సగం నిధులే వినియోగం
– ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో సరిహద్దు నివాసితుల కోసం భూగర్భ బంకర్లు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు సద్వినియోగం కాలేదు. గత ఐదేండ్లలో కేటాయించిన ఈ నిధుల్లో దాదాపు సగం నిధులను అస్సలు ఖర్చు చేయలేదు. సమాచార హక్కు (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా పొందిన సమాచారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గత నెలలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, పాక్ నుంచి తీవ్రమైన కాల్పులు వంటి ఘటనలు నేపథ్యంలో ప్రజా భద్రత కోసం ఆందోళనలు పెరుగుతున్న సందర్భంలో ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం. జమ్మూకాశ్మీర్కు చెందిన రామన్కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు ఆ రాష్ట్ర హోం శాఖ స్పందించింది. హోం శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం 2020-21 నుంచి 2024-25 వరకూ జమ్మూకాశ్మీర్కు భూ గర్భ బంకర్ల కోసం కేంద్రం రూ. 242.77 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో 46.58 శాతం నిధులను ఇప్పటికి వ్యయం చేయలేదు. రాజౌరి జిల్లాలో అత్యధికంగా రూ. 78.05 కోట్లును వినియోగించారు. ఈ తరువాత ఫూంచ్ జిల్లాలో రూ. 44.56 కోట్లు వినియోగించారు. సాంబా జిల్లాలో రూ. 42.09 కోట్లు, కథువాలో రూ.37.20 కోట్లు, జమ్ములో రూ. 17.51 కోట్లు, కుప్వారాలో రూ.14.85 కోట్లు, బండిపోరాలో రూ4.33 కోట్లు, బారాముల్లా రూ.4.15 కోట్లు వ్యయం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య మొత్తం 3,323 కిమీ సరిహద్దు ఉంది. దీనిలో 965 కి.మీ జమ్మూకాశ్మీర్లో ఉంది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ నుంచి కాల్పులను ఎదుర్కొంటున్న సరిహద్దు గ్రామాల ప్రజల కోసం బంకర్లు నిర్మించడానికి 2018-19లో కేంద్రం ముందుగా 14,460 వ్యక్తిగత, కమ్యూనిటీ బంకర్లకు అనుమతి ఇచ్చింది. వీటి కోసం రూ.415. 73 కోట్లు మంజూరు చేసింది. నియంత్ర రేఖ వెంబడి గ్రామాలకు 7,298 బంకర్లు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలకు 7,162 బంకర్లకు అనుమతి ఇచ్చింది. ఈ తరువాత ఉత్తర కాశ్మీర్ జిల్లాలకు 4 వేలకు పైగా బంకర్లు మంజారు చేసింది. అయితే జమ్మూకాశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటల్ డల్లూ వివరాల ప్రకారం సరిహద్దుల్లో ఇప్పటి వరకూ 9,500 బంకర్లను మాత్రమే నిర్మించారు. గత నెలలో పాకిస్తాన్ జరిపిన తీవ్ర దాడుల సమయంలో సరిహద్దు గ్రామాల ప్రజలు ఈ బంకర్లును ఉపయోగించుకునే ప్రాణాలను రక్షించుకున్నారు.
సద్వినియోగం కాని ‘భూగర్భ బంకర్ల’ నిధులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES