Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'మేకిన్‌ ఇండియా' కాదు.. 'ఇన్వెంట్‌ఇన్‌ తెలంగాణ'

‘మేకిన్‌ ఇండియా’ కాదు.. ‘ఇన్వెంట్‌ఇన్‌ తెలంగాణ’

- Advertisement -

– ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా సర్కార్‌ అడుగులు
– ‘ఐఐటీఈఎక్స్‌-2025’ ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‘మేకిన్‌ ఇండియా’ కాదు… ‘ఇన్వెంట్‌ ఇన్‌ తెలంగాణ’ అన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివారం హైటెక్స్‌లో ‘ది ఫెడరేషన్‌ ఆప్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ ఆప్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ(ఎఫ్‌టీసీసీఐ)’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండిస్టియల్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ఎక్స్‌ పో 2025’ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలంగాణ ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌(ఐఐపీ) కంపౌండ్‌ మంత్లీ గ్రోత్‌ (సీఎంజీఆర్‌) రికార్డు స్థాయిలో 2.9 శాతం నమోదైందని తెలిపారు. అదే క్రమంలో జాతీయ సగటు 0.52 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. 2024-25లో ఇండిస్టియల్‌ గ్రాస్‌ స్టేట్‌ వాల్యూ యాడెడ్‌(జీఎస్‌వీఏ) రూ.2.77 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ఇంధన వినియోగంలో 15.6 శాతం, జీఎస్టీ వసూళ్లలో 9.8 శాతం, పే రోల్‌ ఎన్‌రోల్‌ మెంట్‌లో 13.9 శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని శ్రీధర్‌బాబు తెలిపారు. తమ సర్కార్‌ అయిదేండ్ల కోసం కాకుండా రాబోయే తరాల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల బలోపేతంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. గత 18 నెలల్లో కొత్తగా 15వేల ఎంఎస్‌ఎంఈలు ప్రారంభం కావడమే ఆందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంగా ప్రత్యేక జోన్లు
అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపల టెక్నాలజీ సర్వీసెస్‌ జోన్‌, బయట వ్యవసాయ, గ్రామీణ ఇన్నోవేషన్‌ జోన్‌, రెండింటి మధ్య మ్యానుఫాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరూ విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ”ఏడాదిన్నర కాలంలోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకొచ్చాం. ఒక్క లైఫ్‌ సైన్సెస్‌ రంగంలోనే రూ.40వేల కోట్ల పెట్టుబడులొచ్చాయి. 150 కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. 51వేల మందికి ప్రత్యక్షంగా, 1.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీ, లైఫ్‌ సైన్సెస్‌ సిటీ, గ్రీన్‌ ఇండిస్టియల్‌ కారిడార్స్‌ ను అభివృద్ధి చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి వికేంద్రీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించా” అని శ్రీధర్‌బాబు తెలిపారు..ఈ కార్యకమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు డా.సురేష్‌ కుమార్‌ సింఘాల్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు ఆర్‌.రవి కుమార్‌, ఉపాధ్యక్షుడు కేకే మహేశ్వరి, ఐఐటీఈఎక్స్‌ 2025 కన్వీనర్‌ విమలేష్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -