- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాదాపూర్ పరిధి సున్నం చెరువులోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. ఇక్కడ ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోంది. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది.
- Advertisement -