- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీసు స్టేషన్ పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ కూలి నలుగురు సెంట్రింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ వార్డులో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -