- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సోమవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వీడ్కోలు పలుకబోతున్నారు. 18 రోజుల యాత్ర ముగించుకొని భూమిపైకి తిరిగిరాబోతున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా చివరి సందేశం ఇచ్చారు. అంతరిక్షం నుంచి భారత్ను గమనిస్తే.. ఉన్నత ఆశయంతో కూడిన, నిర్భయమైన, నమ్మకమైన, గర్వంతో ఉప్పొంగుతున్న దేశంగా కనిపిస్తోందన్నారు. ఈ రోజుకూ మన దేశం ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
- Advertisement -