- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్పై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై శ్రీగణేశ్ స్పందించారు. ‘నాపైన ఉద్దేశ్యపూర్వకంగా దాడి ప్రయత్నం జరిగిందనే అనుమానం ఉంది. నా నియోజకవర్గంలో మా పార్టీకి చెందిన ఓక నేత నన్ను టార్గెట్ చేశారు. ఆయన వ్యవహారశైలిపై గత శుక్రవారం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశా. ఆ వెంటనే నా సన్నిహితులను భయబ్రాంతులకు గురి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు.
- Advertisement -