అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వాహన యజమానులపై తీవ్ర భారం!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రవాణాశాఖలో సర్వీస్ చార్జీలు భారీగా పెరిగాయి. వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, టాక్సేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లకు సంబంధించిన చార్జీలను గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో వాహన యజమానులపై భారీగా అదనపు భారం పడింది. కాగా 2017లో చివరిసారిగా సర్వీస్ చార్జీలను సవరిస్తే.. మళ్లీ ఇప్పుడే పెంచినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. కొత్త రేట్ల ప్రకారం లైసెన్స్ సర్వీస్ చార్జీని రూ.200కు, మోటార్ వెహికల్ డ్రైవింగ్ సర్వీస్ చార్జీ రూ.300కు పెంచారు. నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్కు రూ.400 వసూలు చేయనున్నారు. వాహన రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగాయి. టూ వీలర్ల రిజిస్ట్రేషన్లో కొనుగోలు ధరపై 0.5 శాతం అదనపు చార్జీ వసూలు చేయనుండగా, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై 0.1 శాతం పెంపు అమలులోకి వచ్చింది. ఆటో రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250 చేరగా, మిగతా వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500కి పెరిగింది.ఫిట్నెస్ సర్టిఫికెట్ రేట్లు కూడా పెరిగాయి. త్రీ వీలర్లకు రూ.200, మిగతా వాహనాలకు రూ.300 వసూలు చేయనున్నారు. అదే విధంగా పర్మిట్ సర్టిఫికెట్ ఫీజులు పెరిగాయి. త్రీ వీలర్లకు రూ.200, మిగతా వాహనాలకు రూ.300 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంపుతో రవాణా శాఖలో సేవలు పొందేవారికి అదనపు వ్యయం తప్పదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహన యజమానులపై ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు, బీమా ఖర్చులు, టోల్ ఫీజులు వంటి భారం ఉండగా.. ఇప్పుడు సర్వీస్ చార్జీల పెంపు మరింత భారంగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. సవరించిన ధరలు భారంగా ఉన్నాయని, వాటిని కొంతమేర తగ్గించాలని వినియోగదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పెరిగిన రవాణా సర్వీస్ చార్జీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES