- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటక సహకార శాఖ మంత్రి కె.ఎన్. రాజన్న తన పదవికి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఓట్లను దొంగిలించిందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఓటర్ల జాబితా గురించి ఎందుకు ప్రశ్నించలేదని రాజన్న బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ప్రకటనపై హైకమాండ్ సీరియస్ అయ్యింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
- Advertisement -