- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ విచారణ ముగిసింది. బుధవారం దాదాపుగా మూడున్నర గంటలపాటు ఆమెను అధికారులు ప్రశ్నించారు. మంచు లక్ష్మి తన ఐదేళ్ల బ్యాంక్ లావాదేవీల వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది.
- Advertisement -