Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeసినిమావినోదం+సందేశం

వినోదం+సందేశం

- Advertisement -

రాజేంద్రప్రసాద్‌, సాయికిరణ్‌, జోగిని శ్యామల ముఖ్య పాత్రధారులుగా చిరంజీవి తన్నీరు దర్శ కత్వంలో తెరకెక్కుతున్న సందేశభరిత వినోదాత్మక చిత్రం ‘నేనెవరు?’.
జై చిరంజీవ మూవీ మేకర్స్‌ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్‌ సమర్పణలో అండేకర్‌ జగదీష్‌ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రంతో వైజాగ్‌ సత్యానంద్‌ శిష్యులు అభిలాష్‌, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక, సోనాక్షి జబర్దస్త్‌ రాజమౌళి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్‌ ముగించు కుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించుకోనున్న ఈ చిత్ర టైటిల్‌ లోగోను తెలుగు చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, నిర్మాత కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, దర్శకులు రేలంగి నరసింహారావు, వి.సముద్ర ఆవిష్కరించి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాస్‌, పాటలు: ఎస్‌.ఎస్‌.వీరు, మ్యూజిక్‌: చిన్నికష్ణ, ఎడిటర్‌: నందమూరి హరి – తారక రామారావు, సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్‌ కొల్లి, రచన – దర్శకత్వం: చిరంజీవి తన్నీరు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad