Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాసేప‌ట్లో ఖైరతాబాద్ గణేశ్​ నిమజ్జనం

కాసేప‌ట్లో ఖైరతాబాద్ గణేశ్​ నిమజ్జనం

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: తొమ్మిది రోజులు విజ‌య‌వంతంగా పూజ‌లందుకున్న‌ ఖైరతాబాద్ బడా గణేశ్​ నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. మహాగణపతిని నిమజ్జనం కోసం భారీ టస్కర్ పై ఎక్కించి వెల్డింగ్​ పనులు పూర్తి చేశారు. కాసేపట్లో హుస్సాన్ సాగ‌ర్‌లో నిమ‌జ్జ‌నం చేయ‌నున్నారు. ఈ వేడుక‌ను చూడ‌డానికి గ‌ణేష్ భ‌క్తులు ట్యాక్ బండ్ వ‌ద్ద‌కు భారీగా చేరుకున్నారు. జ‌న‌స‌ముహాంతో ట్యాంక్ బండ్ దారుల‌న్ని జ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా అనే నినాదాల‌తో మారుమోగుతున్నాయి.

ఖైరతాబాద్ గణేశుడిని ఎక్కించిన టస్కర్ 26 టైర్లతో 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంటుంది. వెల్డర్ నాగబాబు ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఐరన్ స్తంభాలతో బలమైన బేస్‌ను ఏర్పాటు చేసి, విగ్రహాన్ని సురక్షితంగా హుస్సేన్ సాగర్ తీరంలోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు తరలించేందుకు సిద్ధం చేశారు.

మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య నిమజ్జనం పూర్తి చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ శోభాయాత్ర సెన్సేషన్ ​థియేటర్ ​నుంచి ఇక్బాల్ ​మినార్, సైఫాబాద్​ ఓల్డ్ ​పీఎస్, టెలిఫోన్​ భవన్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ​పక్క నుంచి, సెక్రటేరియేట్​ మీదుగా సాగి..ఎన్టీఆర్​ గార్డెన్​ ఎదురుగా ఉన్న నాలుగో నంబర్​ క్రేన్ ​వద్ద నిమజ్జనం కానున్నది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad