- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ‘ఇందిరమ్మ బీమా’ పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబర్ 19న ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆ రోజున మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా స్కీమ్ను అమలు చేస్తామన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత బీమాను వర్తింపజేస్తామన్నారు. ఈ పథకం ద్వారా 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
- Advertisement -



