నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి పెట్టి సాంకేతికంగా తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరు అని ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అలాగే, ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు అని విమర్శించారు. ప్రజల దృష్టిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.. లేదంటే, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి పెట్టి సాంకేతికంగా తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరు అని ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరు: జగదీశ్ రెడ్డి
- Advertisement -
- Advertisement -