నవతెలంగాణ – లక్నో : ఉత్తరప్రదేశ్ బారబంకిలో దారుణం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్ను ఇద్దరు దుండగులు లైంగికదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. ఆమెను మసౌలీ సమీపంలో ఉన్న కాలువ దగ్గరికి తీసుకెళ్లాడు. అతని స్నేహితుడు భూపేంద్రతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం చున్నీతో గొంతు బిగించి హత్య చేసి శవాన్ని కాలువలో పడేశారు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఆమె మృతదేహం కాలువలో లభ్యమైంది. నిందితులు రాజు వర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. అత్యాచారం, హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉత్తరప్రదేశ్లో స్కూల్ టీచర్ పై సామూహిక లైంగికదాడి.. హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES