- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో కుట్టు అట్ట (బక్వీట్ గింజల పిండి) తిని దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో బాధపడిన బాధితులను బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల ప్రజలు ఈ ఫుడ్ పాయిజన్కు గురయ్యారు. పోలీసులు ఆహార శాఖను అప్రమత్తం చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కలుషితమైన కుట్టు అట్ట అమ్మకాలను నిలిపివేయాలని దుకాణదారులను హెచ్చరించారు. ఆహార శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -