- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు రేపటి నుంచి(శుక్రవారం) దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండేళ్ల కాలానికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతులతో ఎక్సైజ్ శాఖ కొత్త లైసెన్సులు జారీ చేయనుంది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. కాగా ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు దుకాణాలు పొందేందుకు అనర్హులు.
- Advertisement -