- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రోజర్ బిన్నీ నిష్క్రమణతో బోర్డు అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడ్డ సంగతి తెలిసిందే. 45 ఏళ్ల మన్హాస్ ఢిల్లీ తరఫున 157 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, 130 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడాడు. అతడు 55 ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. మన్హాస్ జమ్ముకశ్మీర్ క్రికెట్ సంఘంలో పాలకుడిగా పనిచేశాడు. అతను భారత జట్టు తరఫున ఎప్పుడూ ఆడలేదు.
- Advertisement -