- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తుపై విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. వారంలో రెండుసార్లు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొంటూ సిట్ జులై 19న అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. తాజాగా బెయిల్ రావడంతో విడుదల కానున్నారు.
- Advertisement -