- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శనివారం ఉదయం శ్రీనగర్లో పాక్ దాడులకు దిగింది. దీంతో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. మధ్యాహ్నం మరోసారి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం 11.45 గంటలకు శ్రీనగర్ ఎయిర్పోర్టు సమీపంలో 2 భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సైరన్లు మోగుతున్నాయి.
- Advertisement -