- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీనటి డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్నగర్ పీఎస్లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని పనిమనిషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కుక్క అరిచిందని చెప్పి తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను చిత్రహింసలకు గురిచేసిన హయాతితో పాటు ఆమె భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది.
- Advertisement -