- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్: మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ ‘కాల్డ్రిఫ్’ తాగి 20 మంది చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో, ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఔషధ ఉత్పత్తుల పరీక్షలను కఠినతరం చేయాలని, తనిఖీలు నిర్వహించకుండా ఒక్క బ్యాచ్ ఔషధం కూడా మార్కెట్కు వెళ్లకూడదని ఆదేశించింది. మధ్యప్రదేశ్లో గత 24 గంటల్లో నాలుగు కొత్త మరణాలు సంభవించాయి.
- Advertisement -