- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అభ్యర్థులను ఖరారు చేసి బీ ఫారం ఇవ్వాలని, నో డ్యూ పత్రాలు ఇప్పించాలని ఆదేశించారు. పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘ఇన్ఛార్జి మంత్రులు.. ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయాలి. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ నిర్ణయిస్తుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసుపై పీసీసీ చీఫ్ పర్యవేక్షించాలి. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి’’ అని తెలిపారు.
- Advertisement -