- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో భారీ దొంగతనం జరిగింది. కాలేజీ నుంచి దుండగులు రూ.కోటికి పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కళాశాల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి, నిందితుల కోసం చర్యలు చేపట్టారు. చోరీకి కారణాలు, నిందితుల కదలికలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
- Advertisement -