- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలకు ఎన్డీయే ప్రభుత్వం తూట్లు పొడిచిందని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీన పరిచారని మండిపడ్డారు. ఆర్టీఐను నీరు గార్చేందుకే కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని చెప్పారు. ఆర్టీఐ తీసుకొచ్చి 25 ఏళ్లయిన సందర్భంగా దాని గొప్పతనం తెలియజేయాలనుకున్నామని పేర్కొన్నారు.
- Advertisement -