- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న మరో తెలుగు విద్యార్థి, తెలంగాణకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల, అనారోగ్యంతో మృతిచెందాడు. మహబూబ్నగర్కు చెందిన అరుణ్ ఫ్లోరిడాలోని టెంపాలో నివసిస్తున్నాడు. జూన్ 19న అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- Advertisement -



