- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన పలు తెలుగు సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘ఆది’, ‘ప్రేమ కావాలి’ వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా షూటింగ్లో గాయపడటంతో గుండె సమస్యలు తలెత్తాయని, సంక్రాంతికి సొంత ఊరు వెళ్లినప్పుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిసింది. ఆయన పెళ్లి చేసుకోలేదని, తల్లితో కలిసి ఉండేవారని సమాచారం.
- Advertisement -



