Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లిలో అఖండ శివనామ సప్త ప్రారంభం

డోంగ్లిలో అఖండ శివనామ సప్త ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని శివాలయంలో బుధవారం అఖండ శివనామ సప్త ప్రారంభించారు. ఈ సప్త కార్యక్రమం ఈనెల 18 నుండి 25వ తేదీ వరకు కొనసాగుతుందని సప్త నిర్వాహకుల ప్రముఖులు గణేష్ పటేల్, శశాంక్ పటేల్, పలువురు గ్రామ పెద్దలు తెలిపారు. సప్త కార్యక్రమ ప్రారంభోత్సవానికి బిచ్కుంద మండలంలోని కత్గావ్ మహారాజ్, మల్లికార్జున అప్ప ఆధ్వర్యంలో సప్త ప్రారంభంచారు. అఖండ శివనామ సప్త కొనసాగే రోజుల్లో ప్రముఖ మహారాజులు రోజువారి కీర్తన భజనల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. వారం రోజులపాటు నిర్వహించే సప్త కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అఖండ శివ నామ సప్త విజయవంతం కావడానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -