- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన సంఘటనల స్ఫూర్తితో ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో ఈ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తన తాత నేతాజీ ఆశయాలకు అనుగుణంగా, లౌకికవాద భావజాలంతో ఈ పార్టీ ముందుకు సాగుతుందని చంద్రకుమార్ బోస్ తెలిపారు. గతంలో బీజేపీ నుంచి టీఎంసీలో చేరిన ఆయన, ఇటీవల ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.
- Advertisement -



