– అధ్యక్ష, కార్యదర్శులుగా కె.బ్రహ్మచారి, ఏజే రమేష్
నవతెలంగాణ-మణుగూరు
సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ అధ్యక్షకార్యదర్శులుగా కె.బ్రహ్మచారి, ఏజే.రమేష్ ఎన్నికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో మణుగూరులోని కామ్రేడ్ కూకట్ల శంకర్ నగర్, కామ్రేడ్ ఎర్ర శ్రీకాంత్ ప్రాంగణంలో 4వ జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. మహాసభ రెండో రోజు సోమవారం 45మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అధ్యక్షులుగా కె.బ్రహ్మచారి, కార్యదర్శిగా ఏజే.రమేష్, ఉపాధ్యక్షులుగా జీలకర్ర పద్మ, పిట్టల అర్జున్, గద్దల శ్రీనివాస్ రావు, ఎస్ఏ నబీ, దొడ్డ రవికుమార్, బి.వెంకట రాజు, ఈసా వెంకటమ్మ, సహాయ కార్యదర్శుగా కె.సత్య, జి.ధనలక్ష్మి, భూక్య రమేష్, విజయగిరి శ్రీనివాస్, వజ్జా సుశీల, బండారు శరత్, రాజేష్ను ఎన్నుకున్నారు. నూతన ంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందన్నారు. వాటిని వెనక్కి తీసుకునే వరకూ అలుపెరుగని పోరాటం నిర్వహిస్తామన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఐటీయూ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



