- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ప్రదేశ్లోని అటల్ టన్నెల్ వద్ద షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. మనాలి నుంచి లాహౌల్ వెళ్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్పైకి దూసుకెళ్లింది. ఇనుప రాడ్లు కారులో చొచ్చుకుపోయాయి. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన కైలాష్ (34) మృతి చెందగా.. ఆదిత్య, రాజేంద్ర అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చిన కారు.. టర్నింగ్ పాయింట్ వద్ద అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్లను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.
- Advertisement -



