నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్ట్ ల పిల్లలకు 50%శాతం రాయితీ కల్పించాలని గురువారం టీ. ఎస్.జే.యూ.రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఇండియా) రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ ల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన డి.ఈ.ఓ రాజేందర్ జిల్లాలోని ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలో జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించేలా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జర్నలిస్టుల ఆర్థిక సమస్యలు దృష్టిలో ఉంచుకొని ఫీజు రాయితీ కల్పించిందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన జిల్లా కలెక్టర్ కు,జిల్లా విద్యాశాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ.ఎస్.జే.యూ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్,జిల్లా సంయుక్త కార్యదర్శులు కడపాక రవి,బొచ్చు భూపాల మీడియా ఇంచార్జ్ కారుకూరి సతీష్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు మారపాక చంద్రమౌళి,బొల్లపల్లి జగన్ తదితరులు ఉన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES