Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్కార్మికులకు అండ సీఐటీయూ జెండా..

కార్మికులకు అండ సీఐటీయూ జెండా..

- Advertisement -

కార్మిక హక్కులను కాలరాస్తు కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం…
ఈనెల 20 న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..
సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు..
నవతెలంగాణ – మునుగోడు:
కార్మికుల హక్కుల సాధన కోసం కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే జెండా సీఐటీయూ జెండా అని మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు అన్నారు. సోమవారం మే డే వారోత్సవాల్లో భాగంగా మునుగోడు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న  జెండాను గ్రామపంచాయతీ కార్మికులు , భువన కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ పథకాలు అందించకుండా కార్మికుల హక్కులను ప్రభుత్వలు కాలరాస్తూ.. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆయన విమర్శించారు. కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించేది సీఐటీయూ అని అన్నారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఐటీయూ అండగా ఉంటుందని అన్నారు. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్ , యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి , జీడిమడ్ల సైదులు , నూకల పెద్దమ్మ , అండాలు, అరుణ , పెరమళ్ళ రాజు , వేముల విజయ్ , పావని , సంపూర్ణ , యాదమ్మ,  దుర్గయ్య  , తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -