- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణను బలవంతంగా ఆమోదించాలని కేంద్రం భావిస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ లో బిల్ పాస్ చేస్తే భారీ ఎత్తున ఉద్యమం చేపడుతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. డీలిమిటేషన్పై తాము మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నామని, దీనివల్ల నష్టపోతున్న రాష్ట్రాలు ఏకమై చెన్నైలో సమావేశం నిర్వహిస్తామని స్టాలిన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ఒక వీడియోను విడుదల చేశారు.
- Advertisement -



