మెడిపల్లిలో టోల్ వసూల్
వాహనానికి రూ.100
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం): పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలకు టోల్ బాదుడు తప్పడం లేదు. కాళేశ్వరం గ్రామపంచాయతీ కార్యాలయం పేరు మీద తయారు చేసిన చిట్టీలను ఇస్తూ వాహనదారుల నుంచి పార్కింగ్, ప్రవేశ రుసుము పేరిట రూ.100 వసూలు చేస్తున్నారు. సాధారణంగా కాళేశ్వరం వచ్చే వాహనాలకు ప్రవేశ రుసుము వసూలు చేయడానికి గ్రామపంచాయతీ ద్వారా పలువురు టెండర్ దక్కించుకున్నారు. కాళేశ్వరంలోని గోదావరి నది, ఆలయం వైపు వెళ్లే వాహనాలకు కాంట్రాక్టర్లు టోల్ వసూలు చేయాల్సి ఉంది. సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం కావడంతో కాంట్రాక్టర్లు కాళేశ్వరం ప్రారంభంలోని ముక్తివనం వద్ద వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం మొద లుపెట్టారు. పుష్కరాల రెండో రోజు వాహనాల రద్దీ పెరగగా.. టోల్ ఫీజు వసూలుచేసే చోట ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో టోలీఫీజు వసూలు రద్దుచేస్తూ కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీచేశారు. ఐదు రోజుల పాటు టోల్ వసూలు నిలిపివేశారు. ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు వన్వే చేయడంతో కాళే శ్వరం వచ్చే వాహనాలను అన్నారం క్రాస్ మీదుగా చండ్రుపల్లి, మద్దులపల్లి, పూస్కుపల్లి మీదుగా మళ్లించారు. ఇదే అదనుగా భావించిన టోల్ కాంట్రాక్టర్లు కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మళ్లీ టోల్ వసూలుకు పాల్పడుతున్నారు. కాళేశ్వరం గ్రామపం చాయతీ పరిధి దాటి వచ్చే వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.100 వసూలు చేస్తున్నారు. టోల్ చెల్లించవద్దని కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెప్పినప్పటికీ పట్టిం చుకోకుండా నిర్వాహకులు జులుం ప్రదర్శిస్తున్నారని వాహనదారులు వాపోయారు. టోల్ వసూల్ అంశం కలెక్టర్ దృష్టికి వెళ్లగా.. టోల్ రద్దు చేయాలని తిరిగి ఆదేశించినప్పటికీ వసూళ్లు మాత్రం ఆగడం లేదు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES