– క్రీడా స్పూర్తి ఐక్యతను పెంపొందిస్తుంది
– విజేతలను అభినందించిన కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
క్రీడా స్పూర్తి ఐక్యతను పెంపొందించడం మే కాకుండా శరీరం దారుఢ్యం కలిగిస్తుందని కమీషనర్ నాగరాజు విద్యార్ధులకు సూచించారు. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభం అయిన మండల స్థాయీ ఉన్నత పాఠశాల ల క్రీడలు బుధవారం ముగిసాయి. రెండో రోజు మండలంలోని అన్ని యాజమాన్యాల బాలికల పాఠశాలల అండర్ 14 విభాగం లో క్రీడలు నిర్వహించారు. విన్నర్, రన్నర్ విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కన్వీనర్, ఎంఈఓ ప్రసాదరావు, కో – కన్వీనర్,పెద్దవాగు ప్రాజెక్ట్ పీడీ హథీరాం, ఆయా పాఠశాలల ప్రధానోపాద్యాయులు, పీడీ లు పాల్గొన్నారు.
ముగిసిన మండల స్థాయి క్రీడలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES