Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఢిల్లీ తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

ఢిల్లీ తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
దేశ రాజధాని న్యూఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 4,5,6 తేదీలలో జంతర్ మంతర్ వద్ద జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మండలం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల  ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో  సోమవారం ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈనెల 6న  జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిర్వహించనున్న ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొననున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి న్యూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి మండలం నుండి బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో సుంకేట శ్రీనివాస్, వూట్నూర్ ప్రదీప్, వల్గొట్ రంజిత్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad