నవతెలంగాణ-డిచ్పల్లి: నిజామాబాద్ నగరానికి చెందిన ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో.. ఈ నెల 7 నుండి 11వరకు డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ చెప్పారు.సోమవారం సాయంత్రం డిచ్పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ క్రికెట్ టోర్నీ డిచ్పల్లి సీఎంసీ మైదానంలో జరుగుతుందన్నారు. డిచ్పల్లి మండలంలోని వివిధ గ్రామాలతో పాటు తెలంగాణ యూనివర్శిటీ,ఏడో పోలీస్ బెటాలియన్లకు చెందిన 16 జట్లు ఇందులో పాల్గొంటున్నాయని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలనే సంకల్పంతో క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్టు డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరించారు. క్రికెట్ పోటీల్లో విజేతలకు 11వ తేదీన జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.ఈ సమావేశంలో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు బి.వినోద్,ఎం.బాబు,బి.వనిత,జె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 7 నుండి 11వరకు డిచ్పల్లిలో క్రికెట్ టోర్నమెంట్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



