- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి/మాచారెడ్డి : మండలంలోని గజ్య నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, సర్పంచ్ రావుల వినోద చేతుల మీదుగా సుమారు 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరళ, ఎంపీడీవో గోపిబాబు, డీటీ బిక్షపతి, ఉప సర్పంచ్ బిక్షపతి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



