నవతెలంగాణ – జుక్కల్: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కలిసి ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ను హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన కుమార్తె వివాహ మహోత్సవానికి సచిన్ సావంత్ను ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. సచిన్ సావంత్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో నిండాలని సచిన్ సావంత్ ఆకాంక్షించారు.
సచిన్ సావంత్ ను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



