- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అనకాపల్లి జిల్లా పరిధిలో గురువారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 12:31 గంటల సమయంలో 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలతో పాటు పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
- Advertisement -



