Sunday, April 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన

వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో రాజకీయ హింసపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. “ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా వారు తెగించారు” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్, సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో జరిగిన దాడి ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. షాట్‌గన్, హ్యాండ్‌గన్‌తో సహా పలు ఆయుధాలు కలిగిన 31 ఏళ్ల అనుమానితుడు సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్‌ను దాటుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాల్పులు జరపడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. కాల్పుల శబ్దంతో వందలాది మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు భయంతో టేబుళ్ల కింద దాక్కున్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు బుల్లెట్ తగిలింది. అయితే, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉండటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -